'తెరి' (తెలుగులో 'పోలీస్') వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు విజయ్, కథానాయిక సమంత, దర్శకుడు అట్లీ కాంబినేషన్ వస్తున్న చిత్రం 'మెర్సల్'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో సమంతతో పాటు కాజల్, నిత్యా మీనన్ కూడా హీరోయిన్స్గా నటిస్తున్నారు.
ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రంలోని తమిళ వెర్షన్ పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పాటలకు మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్ని రేపు సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నారు. దీపావళి కానుకగా విడుదల కానున్న 'మెర్సల్' పై తమిళ నాట భారీ అంచనాలే ఉన్నాయి.