తమిళ కథానాయకుడు విజయ్ త్రిపాత్రాభినయంలో రూపొందిన తమిళ చిత్రం 'మెర్సల్'. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి 'రాజా రాణి' ఫేమ్ అట్లీ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా 'అదిరింది' పేరుతో విడుదల కానుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం 6 గంటలకు 'మెర్సల్' తమిళ వెర్షన్ టీజర్ విడుదలైంది. కట్ చేస్తే.. ఇప్పటికే 10 మిలియన్లకి పైగా వ్యూస్ని పూర్తిచేసుకుంది. ఈ విషయంపై దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ట్విట్టర్లో స్పందిస్తూ.. 'మెర్సల్' 10 మిలియన్ల వ్యూస్ని దాటేసింది. ఇదొక ప్రపంచ రికార్డ్ అంటూ చెప్పుకొచ్చారు. టీజర్ లాగే సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.