అమెరికాలోని మేరీల్యాండ్ రాజధాని అనాపొలిస్లో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు క్యాపిటల్ గెజిట్ పత్రికా ఆఫీస్లో చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడి. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పత్రికా కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు.. అందులోని సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. రంగంలోకి దిగిన పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.