Iran War: పశ్చిమాసియాకు భారీగా అమెరికా సైన్యం.. అసలేం జ‌రుగుతోంది.?

Iran War Latest News: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచుతోంది. ఈక్ర‌మంలోనే తాజాగా అమెరికా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Update: 2026-03-29 07:34 GMT

Iran War Latest News

Iran War Latest News: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచుతోంది. ఈక్ర‌మంలోనే తాజాగా అమెరికా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

తాజా సమాచారం ప్రకారం, అమెరికా 3,500 కంటే ఎక్కువ సైనికులను మధ్యప్రాచ్యానికి పంపింది. ఇదే సమయంలో పెంటగాన్ ఇరాన్‌పై అవసరమైతే భూభాగ యుద్ధానికి కూడా సిద్ధమవుతోంది. అమెరికా నౌకాదళానికి చెందిన USS Tripoli అనే ఆధునిక యుద్ధ నౌక ఇప్పటికే మధ్యప్రాచ్య ప్రాంతానికి చేరుకుంది. ఈ యుద్ధ నౌకలో సుమారు 2,500 మంది అమెరికా మెరైన్స్ (Marines) ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

ఈ నౌక ప్రత్యేకత ఏమిటంటే

F-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, Osprey విమానాలు, ఆధునిక యుద్ధ సామగ్రి వంటి వాటిని ఒకేసారి నిర్వహించే సామర్థ్యం ఇందులో ఉంటుంది. మొదట ఈ నౌక జపాన్‌లో నిలిచివుండగా, రెండు వారాల క్రితం మధ్యప్రాచ్యానికి పంపాలని ఆదేశాలు వచ్చాయి.

మరిన్ని యుద్ధ నౌకలు, సైనిక బలగాలు

ఇదిలా ఉంటే అమెరికా ఇక్కడితో ఆగలేదు.యూఎస్ఎస్ బాక్స‌ర్ యుద్ధ నౌకతో పాటు సాన్ డియాగో నుంచి మరిన్ని నౌకాదళ బలగాలు కూడా మధ్యప్రాచ్యానికి పంపుతున్నారు. కాగా అమెరికా చేపట్టిన “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” (Operation Epic Fury) అనే సైనిక చర్యలో ఇప్పటివరకు 11,000 కంటే ఎక్కువ లక్ష్యాలను దాడి చేసినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి.

ధీటుగా స్పందిస్తోన్న ఇరాన్

ఇరాన్ కూడా ప్రతిస్పందనగా దాడులు కొనసాగిస్తోంది. ఇటీవల ఇరాన్ సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది అమెరికా సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై (Strait of Hormuz) తన నియంత్రణను కొనసాగిస్తోంది. ఈ ప్రాంతం ప్రపంచ చమురు రవాణాకు కీలకం కావడంతో.. ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇంధన ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది.

యుద్ధంలో కొత్త మలుపు..

ఈ పరిస్థితిని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు దళాలు మరింత క్లిష్టంగా మార్చింది. ఇరాన్ మద్దతుతో ఉన్న ఈ హౌతీ గ్రూప్ ఇటీవల ఇజ్రాయెల్‌పై క్షిపణి ప్రయోగం చేసినట్లు ప్రకటించింది. దీంతో ముఖ్యమైన సముద్ర మార్గాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా బాబ్ ఎల్ మండెబ్ జలసంధి (Bab el-Mandeb Strait),

సుయేజ్ కాలువకు వెళ్లే వాణిజ్య మార్గాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News