'ఇష్క్', 'మనం', '24'.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని డిఫరెంట్ సబ్జెక్ట్లతో సినిమాలు చేసి దర్శకుడిగా మెప్పించాడు విక్రమ్ కుమార్. శ్రియ తొలి తెలుగు చిత్రం 'ఇష్టం'కి ఇద్దరు దర్శకులలో ఒకరిగా వ్యవహరించిన విక్రమ్.. ఆ తరువాత తమిళ, హిందీ చిత్రాల వైపు దృష్టి పెట్టాడు. మళ్లీ 'ఇష్క్'తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ కి ఓ అలవాటు ఉంది.
అదేమిటంటే.. సినిమా సినిమాకి రెండేళ్లు లేదా అంతకు మించి అన్నట్లుగా గ్యాప్ తీసుకోవడం. అయితే.. అఖిల్ రీ లాంఛ్ చిత్రం 'హలో'తో విక్రమ్ తన స్టైల్ని మారుస్తున్నట్టే. ఎందుకంటే.. విక్రమ్ గత చిత్రం '24' విడుదలైన 20 నెలల లోపే తన కొత్త చిత్రం 'హలో'తో పలకరించనున్నాడు విక్రమ్. స్టైల్ మార్చిన విక్రమ్, దాన్నే కొనసాగిస్తూ.. మరిన్ని క్వాలిటీ సినిమాలు అందించాలని ఆశిద్దాం.