వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. రైల్వే టీసీ ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణం తీసింది. తాండూరు నాంపల్లి ప్యాసింజర్ ట్రైన్ లో ఈ ఘటన జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువకుడ్ని పట్టుకునేందుకు టీసీ ప్రయత్నించాడు. భయపడి దూకేయండంతో రైలు కింద పడి మృతి చెందాడు. గొల్లపూడి స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన అనంతరం టికెట్ కలెక్టర్ను ప్రయాణికులు చితకబాదారు. మృతున్ని వికారాబాద్ పరిధి అనంతగిరిపల్లి తండా వాసి కాట్రావత్ శివగా గుర్తించారు.