జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం కేసీఆర్ను కలవడంపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వరుస పోస్టులతో విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు. ‘ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా’ అని ప్రశ్నించారు. అలాగే `అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్` అని మరో కామెంట్ చేశాడు. దీంతో పవన్ అభిమానులు కత్తి వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు.