'జెంటిల్మాన్', 'నిన్ను కోరి' చిత్రాలతో వరుసగా రెండు వరుస విజయాలను సొంతం చేసుకున్న నివేదా థామస్.. తాజాగా 'జైలవకుశ'తో పలకరించింది. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తే.. వాటిలో జై పాత్ర సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చినా.. వసూళ్లు బాగున్నాయి. ఈ సందర్భంగా నివేదా థామస్ హ్యాట్రిక్ విజయాల పట్ల ట్విట్టర్లో స్పందించింది. ఓ లేఖ రూపంలో తన స్పందనని తెలిపిందీ కేరళకుట్టి.
''ఒక సినిమా హిట్ అవ్వడం స్పెషల్. చేసిన మూడు చిత్రాలను ఇంత బాగా అఫ్రిషియేట్ చేసి, తెలుగు ఇండస్ట్రీలో మా అమ్మాయి అని పిలవడం.. ఇంతకంటే పెద్ద కాంప్లీమెంట్ ఏముంటుంది? ఇది ఒక బ్లెస్సింగ్. నా ఫ్యాన్స్ నా ఫ్యామిలీ అయిపోయారు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే.. 'జైలవకుశ'ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. మరో అందమైన చిత్రంలో కొత్త పాత్రతో పలకరిస్తా.. ప్రేమతో మీ నివేదా థామస్'' అంటూ తెలుగు, ఇంగ్లీష్ మాటలను ఆంగ్లాక్షరాలతో పోస్ట్ చేసింది నివేదా.