'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అతడు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో తెలుగువారికి చేరువైన చెన్నై సుందరి త్రిష. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. 'నాయకి' తరువాత మళ్లీ మరో తెలుగు చిత్రానికి సంతకం చేయలేదు. అయితే తమిళంలో మాత్రం అరడజను చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే ఈ సుందరి.. తాజాగా 4మిలియన్ల ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది. జులై 2009లో ట్విట్టర్ అకౌంట్లో చేరిన త్రిష..149 మందిని ఫాలో అవుతోంది. ఈ సందర్భంగా తన 4మిలియన్ల ఫాలోవర్లకి కృతజ్ఞతలు చెప్పింది ఈ సొగసరి.