మహేష్బాబు కథానాయకుడిగా నటించిన '1 నేనొక్కడినే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి సనన్. ఆ చిత్రం కమర్షియల్గా వర్కవుట్ కాకపోయినా.. కృతికి మంచి పేరేనే తీసుకు వచ్చింది. ఆ తరువాత నాగచైతన్య 'దోచేయ్' చిత్రంలో హీరోయిన్గా కనిపించినా.. ఆ సినిమా కూడా పరాజయం పాలవ్వడంతో.. తెలుగు తెరపై మళ్లీ కనిపించనేలేదు కృతి. అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
'హీరో పంతి', 'దిల్ వాలే', 'రాబ్తా', 'బరేలీ కి బర్ఫీ' వంటి హిందీ చిత్రాల్లో ఆమె సందడి చేసింది. వీటిలో 'బరేలీ కీ బర్ఫీ' ఆమెకి సక్సెస్ని ఇవ్వడంతో పాటు నటిగా గుర్తింపుని కూడా తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. కృతికి తాజాగా మరో మంచి అవకాశం దక్కింది బాలీవుడ్లో. స్పానిష్ మూవీ 'ది ఇనివిజబుల్ గెస్ట్'కి బాలీవుడ్ వెర్షన్గా రూపొందనున్న చిత్రంలో జాన్ అబ్రహంకి జోడీగా నటించే ఆఫర్ కృతిని వరించింది. తొలుత ఈ పాత్రకి తాప్సీని అనుకున్నారు. అయితే కాల్షీట్ల సమస్య కారణంగా ఆమె స్థానంలోకి కృతి చేరిందిప్పుడు. డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ థ్రిల్లర్ సినిమా ద్వారా లక్ష్య దర్శకుడిగా పరిచయం కానున్నాడు.