'యుగానికి ఒక్కడు', 'ఆవారా', 'నాపేరు శివ' చిత్రాలతో తెలుగు వారికి చేరువైన తమిళ కథానాయకుడు కార్తీ. తెలుగులో రూపొందిన స్ట్రయిట్ చిత్రం 'ఊపిరి'తో ఇక్కడివారికి మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం 'ధీరన్ అధిగారం ఒండ్రు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు కార్తీ. తెలుగులో ఈ చిత్రాన్ని 'ఖాకీ' పేరుతో విడుదల చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. నవంబర్ 17కి ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 27న, ట్రైలర్ని అక్టోబర్ 17న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ ఆడియో సంస్థ 'ఆదిత్యా మ్యూజిక్' అధినేత ఉమేష్ గుప్తా విడుదల చేస్తున్నారు.