టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా రెండు చోట్లా బిజీగా ఉన్న కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన 'నేను శైలజ', 'నేను లోకల్' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆమె నటించిన మూడో తెలుగు చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఆ చిత్రమే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ ప్రయత్నం.
ఇదిలా ఉంటే.. తమిళంలో ఇప్పటికే సూర్యతో ఓ సినిమా చేస్తున్న కీర్తి.. వచ్చే ఏడాది రెండు సీక్వెల్ చిత్రాల్లో సందడి చేసే అవకాశముంది. 'సామి' ('లక్ష్మీ నరసింహా'కి ఒరిజనల్ వెర్షన్)కి సీక్వెల్గా హరి దర్శకత్వంలో రూపొందుతున్న 'సామి2' (విక్రమ్ హీరో)లోనూ.. 'సండ కోళి' (పందెం కోడి)కి సీక్వెల్గా లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సండకోళి2' (విశాల్ కథానాయకుడు)లోనూ కీర్తి సురేష్నే కథానాయిక. ఈ రెండు సీక్వెల్స్ అమ్మడికి ఎలాంటి గుర్తింపు తీసుకువస్తాయో చూడాలి.