గజ్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుస్తా: కెసిఆర్

Update: 2018-11-12 05:05 GMT

గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుస్తానని అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. గజ్వేల్‌లో ఇల్లు లేనివారు ఎవరూ ఉండకూడదని, ఎర్రవల్లి ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు వేసుకున్నాం. త్వరలోనే గజ్వేల్‌కి రైలు మార్గం వస్తుందని తెలిపారు. గజ్వేల్ ఇంకా విస్తరించబోతుందని, ప్రజలందరికి తాగునీరుఇచ్చాం త్వరలోనే సాగు నీరుకూడా వస్తుందని అలాగే కొండపోచమ్మ ప్రాజెక్ట్ ను నింపితీరుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. 

Similar News