హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నగర బహిష్కరణకు గురై సొంత జిల్లా చిత్తూరుకు చేరుకున్న కత్తి మహేశ్ను పీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకస్మాత్తుగా కత్తి ప్రత్యక్షమయ్యాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. కత్తి మహేష్ సమావేశాలు పెడితే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయనే ఉద్దేశంతోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.కాగా హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన కత్తి మహేష్ ఇటీవల స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని యల్లమంద గ్రామంకు వచ్చారు.