కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులకు ప్రజాధనం దోచుకోవడం తప్ప సమస్యలను పట్టించుకునే తీరిక లేదని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. డివిజన్ 12 లోని పోచమ్మవాడ, షాయిత్ పురాలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సంజయ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో టీఆర్ఎస్ తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. ప్రజలను మభ్య పెడుతున్న టీఆర్ఎస్ను ఓడించాలని సంజయ్ పిలుపునిచ్చారు.