'పెళ్లిచూపులు'తో సోలో హీరోగా తొలి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా విడుదలైన 'అర్జున్ రెడ్డి'తో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వివాదాల నడుమ విడుదలైనప్పటికీ.. సినిమాలోని బోల్డ్ కంటెంట్ యూత్ని బాగా ఎట్రాక్ట్ చేసింది. తమిళంలోనూ, హిందీలోనూ ఈ సినిమా రీమేక్ అయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. 'యువత', 'సోలో' చిత్రాల దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదట లావణ్య త్రిపాఠిని హీరోయిన్గా ఎంచుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి లావణ్య తప్పుకుంది. ఇప్పుడామె స్థానంలోకి కన్నడ హీరోయిన్ రష్మిక చేరింది. 'కిరీక్ పార్టీ' అనే బ్లాక్బస్టర్ కన్నడ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. తెలుగులో ఆమెకిదే తొలి చిత్రం.