పల్లె వెలుగులో పవన్ యాత్ర..

Update: 2018-11-24 13:23 GMT

జనసేన పోరాట యాత్రతో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి పర్యటనలో ఉన్న జనసేనాని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు అండగా నిలిచేందుకు పవన్ బస్సు యాత్ర ప్రారంభించారు బస్సు యాత్రలో భాగంగా రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు సామాన్యులతో కలిసి ప్రయాణించారు. మార్గ మధ్యలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యల్ని, ఏజెన్సీ ప్రాంత గిరిజనుల స్థితిగతుల్ని తెలుసుకున్నారు.  ఈ యాత్రలో పవన్ వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు జనసేన నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు పాల్గోన్నారు.

Similar News