‘కేసీఆర్.. టీఆర్ఎస్‌ పార్టీని అమ్మొద్దు’

Update: 2018-04-07 11:42 GMT

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి. కోదండరామ్‌ వెనుక తాను ఉన్నది అవాస్తవమని అన్నారు. మోడీ అర్థ వయస్కుడైతే, అమిత్‌ షా అల్ప వయస్కుడని... అమిత్‌ షాకి కొనడం, అమ్మడం మాత్రమే తెలుసని, రాజకీయాల గురించి తెలీదన్నారు. టీఆర్‌ఎస్‌ బీజేపీకి తోక పార్టీ అని, మోడీతో కలిసి కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు... మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పెంచుతున్నా మోదీకి సీఎం కేసీఆర్ సహకరించడాన్ని తప్పుపట్టారు. ఎన్నికలు వచ్చే వరకు మోదీకి మిత్రపక్షంగా కేసీఆర్ ఉంటారని, కానీ టీఆర్‌ఎస్‌ పార్టీని మాత్రం బీజేపీకి అమ్మవద్దని పేర్కొన్నారు. 

Similar News