'నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను'.. ఇదీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, యంగ్టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జైలవకుశ' చూశాక ట్విట్టర్ లో తెలిపిన స్పందన.
జై, లవకుమార్, కుశ అనే మూడు పాత్రల్లో తారక్ నటించిన 'జైలవకుశ' నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా.. జై పాత్రలో ఎన్టీఆర్ నటన బాగుందంటూ సర్వత్రా మంచి స్పందన వచ్చింది. సినిమా చూసిన ప్రముఖులు ఎన్టీఆర్ని ప్రశంసలతో ముంచెత్తారు. మొదటి రోజు ఈ సినిమాకి భారీ వసూళ్లే నమోదయ్యాయి.
రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన 'జైలవకుశ' చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించారు.