తెలుగులో హారర్ కామెడీ జోనర్ సినిమాల హవా ఎక్కువగానే ఉంది. 'కాంచన'తో మొదలైన ఈ ట్రెండ్.. 'ప్రేమకథా చిత్రమ్'తో ఊపందుకుంది. నాగార్జున లాంటి స్టార్ హీరోలు కూడా ఇలాంటి చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇదే జోనర్లో మరో చిత్రం తెరకెక్కింది. ఆ సినిమానే 'నెక్స్ట్ నువ్వే' . 'లవ్లీ' ఫేమ్ ఆది హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వైభవి, రేష్మి గౌతమ్ హీరోయిన్స్గా నటించారు.
ఈ టీవీ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇవాళే విడుదలైంది. కాగా, ఈ సినిమాని నవంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. 'లవ్లీ' తరువాత సరైన విజయం లేని ఆది ఈ సినిమాపై భారీ ఆశలనే పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రమైనా అతనికి విజయం అందిస్తుందేమో చూడాలి.