ఈ మధ్యకాలంలో హీరోయిన్లు రహశ్యంగా పెళ్లే కాదు నిశ్చితార్ధాలు కూడా చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటి నేహా ధూఫియా తన బాయ్ ఫ్రెండ్ ను రహస్యంగా వివాహం చేసుకున్నారు. తాజాగా కొత్తబంగారులోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ తనకు వివాహ నిశ్చితార్ధం జరిగినట్లు స్వయంగా వెల్లడించింది. గోవాలో స్నేహితుడు రోహిత్ కు ప్రపోజ్ చేశానని కొన్నాళ్లకు రోహిత్ ఒప్పుకున్నాడని చెప్పింది. అంతే కాదు ఇరు కుటుంబాలు తమ ప్రేమను అంగీకరించడమే కాకుండా పెళ్లికి కూడా ఒకే చెప్పి నిశ్చితార్ధం చేశారన్నారు. అయితే తమ వ్యక్తిగత విషయాలు వెల్లడించడం ఇష్టం లేకనే ఈ వార్త బయటి ప్రపంచానికి చెప్పలేదని శ్వేతా స్పష్టంచేసింది. ఇదిలావుంటే శ్వేతాబసు తెలుగులో కొత్త్తబంగారులోకం, రైడ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించింది. కొత్తబంగారులోకం సినిమా అప్పట్లో భారీ హిట్ అయింది.