'గోల్ మాల్', 'గోల్మాల్ రిటర్న్స్', 'గోల్మాల్ 3'.. ఇలా అజయ్ దేవ్గన్తో దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'గోల్ మాల్' సిరీస్ అన్నీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హాస్య చిత్రానికి నాలుగోభాగంగా 'గోల్మాల్ ఎగైన్' తెరకెక్కుతోంది. తొలి భాగంలో రిమ్మీ సేన్.. రెండు, మూడు భాగాల్లో కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తే, నాలుగో భాగంలో పరిణితీ చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.
సౌత్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. ఈ నెల 22న ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేయనుండగా.. వచ్చే నెల 20న దీపావళి కానుకగా సినిమాని విడుదల చేయనున్నారు. తొలి మూడు భాగాల్లో నటించిన అర్షద్ వార్సి, తుషార్ కపూర్ ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు.