ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న కథానాయికల్లో అను ఇమ్మానియేల్ ఒకరు. నాని కథానాయకుడిగా నటించిన 'మజ్ను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అను.. ఆ తర్వాత 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'తో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనూ.. అల్లు అర్జున్ 'నా పేరు సూర్య'లోనూ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ రూపొందించనున్న సినిమాలోనూ అనునే హీరోయిన్గా నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, తమిళంలో అను నటించిన తొలి సినిమా 'తుప్పరివాలన్' గురువారం విడుదలై విజయపథంలో పయనిస్తోంది. దీంతో అను ఐదు విజయాలను పూర్తిచేసుకున్నట్లయ్యింది. మలయాళంలో అను నటించిన 'స్వప్న సంచారి', 'యాక్షన్ హీరో బిజు'తో పాటు 'మజ్ను', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'.. తాజాగా 'తుప్పరివాలన్'.. ఇలా అను కెరీర్ ఐదు విజయాలతో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అను తదుపరి చిత్రంగా అక్టోబర్ 12న రానున్న 'ఆక్సిజన్' కూడా ఇదే బాటలో పయనిస్తే.. డబుల్ హ్యాట్రిక్ని ఆమె సొంతం చేసుకున్నట్లే. మరి అను లక్ ఎలా ఉందో చూడాలి.