పార్టీ మార్పుపై ప్రకటన చేసిన ముకేశ్ గౌడ్!

Update: 2018-07-01 08:47 GMT

 గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ ఎట్టకేలకు పార్టీ మార్పుపై స్పందించారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు తో భేటీ అనంతరం ముకేశ్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల కాంగ్రెస్ ను వీడిన దానం నాగేందర్ బాటలో తాను నడవని అన్నారు.పైగా  దానం వెళ్ళిపోయినంతమాత్రాన సిటీలో పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని వెల్లడించారు. తాను, తన కుమారుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతామని.. ఏ ఇతర పార్టీలో చేరే ఉద్దేశ్యం  లేదని ముకేశ్ గౌడ్ తెలిపారు. 

Similar News