కోలీవుడ్లో నెం.1 హీరోయిన్గా రాణిస్తోంది గ్లామర్ క్వీన్ నయనతార. గతేడాది సినిమాకి 3 కోట్ల రూపాయిలని డిమాండ్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రెండు తెలుగు చిత్రాల్లోనూ నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లోనూ, బాలకృష్ణ 102వ చిత్రంలోనూ నయన్నే ప్రధాన నాయిక.
ఇదిలా ఉంటే.. 'తని ఒరువన్' రూపంలో నయన కో మెగా హిట్ ఇచ్చిన మోహన్ రాజా.. తన తదుపరి చిత్రం 'వేలైక్కారన్'లోనూ ఆమెనే హీరోయిన్గా ఎంచుకున్నాడు. శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 22కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇదే సెప్టెంబర్ 29కి మరో నయనతార సినిమా తెరపైకి రానుంది. అదే 'అరమ్'. ఇందులో నయన కలెక్టర్ పాత్రలో నటిస్తోంది. మొత్తానికి.. నయన్ సెప్టెంబర్ 29ని మిస్ కావడం లేదన్నమాట.