గద్వాల సంస్థానం మహారాణిగా, వరుసగా విజయాలు సాధిస్తోంది డి.కె. అరుణ. అయితే తన మేనల్లుడి నుంచే గట్టి పోటీ ఎదుర్కోబోతోంది. గద్వాల నియోజకవర్గం నుంచి మరోసారి బండ్ల కృష్ణమోహన్రెడ్డిని బరిలోకి దింపారు కేసీఆర్. వరుసకు బంధువులైనా నియోజకవర్గంలో వీరికి బద్దవైరం నడుస్తోంది. 2014లోనే డికే అరుణకు టఫ్ ఫైట్ ఇచ్చారు బండ్ల కృష్ణమోహన్రెడ్డి. డీకే అరుణను ఎదుర్కొనే సత్తా కేవలం బండ్లకే ఉందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో ఈసారి గద్వాల సంస్థానం కోసం గట్టి యుద్ధం తప్పదన్న చర్చ మొదలైంది.