'కాటమరాయుడు' తర్వాత మరో తెలుగు చిత్రానికి సంతకం చేయని శ్రుతి హాసన్.. కొద్ది నెలల క్రితం ఓ క్రేజీ ప్రాజెక్ట్ని మిస్ చేసుకుంది. అదే 'సంఘమిత్ర'. కుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము విద్యల్లో శిక్షణ కూడా తీసుకుంది శ్రుతి. తర్వాత ఏమైందో ఏమో గానీ.. శ్రుతి ఆ చిత్రం నుంచి తప్పుకుంది.
ఆ తరువాత హన్సిక, అనుష్క, నయనతార వంటి పేర్లు వినిపించాయి. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు శ్రుతి స్థానంలో 'లోఫర్' హీరోయిన్ దిశా పటాని చేరిందని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక వార్త అయితే ఇంకా రాలేదు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించనున్న ఈ చిత్రంలో 'జయం' రవి, ఆర్య హీరోలుగా నటించనున్నారు. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.