ఈ ఏడాది ప్రారంభంలో 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంతో పలకరించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ప్రస్తుతం 'సై సై సయ్యారే' అనే టీవీ కార్యక్రమంతో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా 'జవాన్' సెట్స్కి విచ్చేశారు. అంతేకాకుండా.. ఆ చిత్ర హీరోహీరోయిన్లు సాయిధరమ్ తేజ్, మెహరీన్లపై ఓ షాట్ తీసి యూనిట్ సభ్యులకు విషెస్ చెప్పారు.
ఈ విషయాన్ని 'జవాన్' దర్శకుడు బీవీఎస్ రవి ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న 'జవాన్'ని నవంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతమందించారు.