2014లో చిన్న సినిమాగా విడుదలై.. సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం 'చదురంగ వేట్టై'. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా 'చదురంగ వేట్టై 2' రూపొందుతోంది. అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాకి 'చదురంగ వేట్టై' దర్శకుడు హెచ్. వినోద్ కథ, స్క్రీన్ప్లే, మాటలు అందించగా.. ఎన్వీ నిర్మల కుమార్ దర్శకత్వం వహించారు.
'గజిని' చిత్రంలో అసిన్ బాస్ గా కనిపించి నవ్వించిన ప్రముఖ కమెడీయన్ మనోబాల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ సినిమా ఆడియోని త్వరలోనే విడుదల చేయనున్నారు. సినిమాని అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులోనూ ఈ సినిమా అనువాదమయ్యే అవకాశముంది.