వైసీపీ ఎమ్మెల్యే తనను కలిసిన వార్తలపై రాంమాధవ్‌ ఏమన్నారంటే..

Update: 2018-06-16 01:34 GMT

తనను రెండురోజుల కిందట వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారనే వార్తలపై స్పందించారు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌..అయన నన్ను కలవలేదని ఆ రూమర్లలో వాస్తవం లేదని స్పష్టం చేశారు రాంమాధవ్‌. కాగా  రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీలోని ఏపీ భవన్ కు వెళ్లారు ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అక్కడ ఉండటంతో ఇద్దరు కలిసి రాంమాధవ్‌ ను కలిశారని టీడీపీ ఆరోపించింది. ఇదిలావుంటే టీడీపీ నేతల ఆరోపణలను బుగ్గన ఖండించారు. రాష్ట్రంలో ఎవరు ఎవరిని కలవాలన్న నారా లోకేష్, టీడీపీ నేతల పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. 
 

Similar News