ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం సమర్పించారు. నిత్యం బీద అరుపులు అరిచే చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు సొంత డబ్బుతో ఎన్ని పర్యటనలు చేసినా తమకు అభ్యంతరం లేదన్న ఆయన పరిస్ధితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామంటూ ప్రకటించారు.