సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఎవరూ స్పందించ వద్దని సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారు. సోము తీరుపై ఎవరూ స్పందించవద్దని నేతలు, కార్యకర్తలకు ఆదేశాలిచ్చారు. దిష్టిబొమ్మలు తగలబెట్టడం లాంటి పనులకు దిగకుండా టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని, వాళ్లెలా వున్నా మనం మాత్రం మిత్ర ధర్మాన్ని పాటిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీన్ని బట్టి సోము మీద భేటీలో ఘాటైన చర్చ జరిగినట్లేనని తెలుస్తోంది.