ఏపీలో ఏం జరుగుతోంది? ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రులతో సీఎం అత్యవసర భేటీ

Update: 2018-10-05 10:42 GMT

ఏపీలో జరుగుతున్న ఐటీ దాడుల నేపధ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గ సమావేశానికి హాజరైన మంత్రలతో  భేటి అయిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ దాడులపై చర్చించారు.  ఇదే సమయంలో ఎన్నికల ప్రచారం సీఎం కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు, తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు.  ఐటీ దాడులపై మంత్రి వర్గం సమావేశంలో చర్చిద్దామంటూ పలువురు  చంద్రబాబుకు సూచించారు. అయితే  పూర్తి వివరాలు వచ్చిన తరువాతే పార్టీ తరపున చర్చిద్దామంటూ మంత్రులకు చంద్రబాబు సూచించారు.  
 

Similar News