నేచురల్ స్టార్ నానికి యూత్లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు 'భలే భలే మగాడివోయ్' నుంచి 'నిన్ను కోరి' వరకు వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకుని 'డబుల్ హ్యాట్రిక్ హీరో' అనే పేరు కూడా సంపాదించేశాడు. ప్రస్తుతం నాని 'ఎం.సి.ఎ', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలు చేస్తున్నాడు.
విశేషమేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ కేరళ కుట్టిలే హీరోయిన్గా నటించడం. 'ఎం.సి.ఎ'లో 'ఫిదా' ఫేమ్ సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుంటే.. 'కృష్ణార్జున యుద్ధం'లో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ ఇద్దరూ కూడా మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో పరిచయమైన కథానాయికలే కావడం విశేషం.
నాని కెరీర్ని గమనిస్తే.. ఆయన ఎక్కువగా మలయాళ ముద్దుగుమ్మలతోనే కలిసి నటించిన విషయం అర్థమవుతుంది. శరణ్య మోహన్, నిత్యా మీనన్, కేథరిన్ ట్రెసా, అమలా పాల్, మాళవికా నాయర్, నివేదా థామస్, అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. ఈ జాబితాలో సాయిపల్లవి నెం.9 అయితే, అనుపమ నెం.10 కానుందన్నమాట.