ఈ తరం కథానాయకుల్లో ఆల్రౌండర్ అనిపించుకున్న హీరో యంగ్టైగర్ ఎన్టీఆర్. తాజాగా వచ్చిన 'జైలవకుశ'లో మూడు విభిన్న పాత్రలు చేసి మెప్పించాడు. ముఖ్యంగా నత్తితో మాట్లాడే జై పాత్ర అతనికి మంచి పేరుని తీసుకువచ్చింది. ప్రతినాయకుడి ఛాయలున్న ఈ పాత్రలో తారక్ విశ్వరూపం చూపించాడు.
ఇదిలా ఉంటే.. తన తదుపరి చిత్రంలోనూ ఓ కొత్త పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయనున్న చిత్రంలో తారక్ మిలటరీ ఆపరేటివ్ ఆఫీసర్గా కనిపించనున్నాడని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గానీ.. 'టెంపర్' నుంచి కొత్త పాత్రలవైపే ఆసక్తి చూపిస్తున్న తారక్, ఈ కొత్త పాత్రలోనూ ఒదిగిపోతాడనడంలో అతిశయోక్తి లేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది.