'' 'జై లవకుశ'పై చూపిస్తున్న ఈ ప్రేమ చాలా సంతృప్తినిచ్చింది. ఒక నటుడిగా ఇంతకంటే బెటర్గా ఇంకేమీ అడగను. ప్రతి ఒక్కరికి 'జైలవకుశ' చిత్ర బృందం నుంచి ధన్యవాదాలు'' అంటూ ట్వీట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జై, లవకుమార్, కుశ అనే మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జైలవకుశ' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో జైగా తారక్ నటనకి అభిమాన వర్గం ఫిదా అయిపోయింది. కె.రాఘవేంద్రరావు, రాజమౌళి వంటి దర్శకదిగ్గజాలు కూడా తారక్ అభినయం అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్లో కొనియాడారు. ఇదిలా ఉంటే.. తొలి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.47.25 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిందని సమాచారం.