ఇడియట్ సినిమాతో రవితేజ సరసన నటించి ప్రేక్షకులను మైమరపించిన రక్షిత గుర్తుంది కదూ.. ఆ సినిమాతో కాలేజీలో లవర్స్ అంటే ఇలాగె ఉంటారేమో అనుకునేంతలా ఆ చిత్రంలో నటించింది రక్షిత. ఆ తరువాత నాగార్జునతో శివమణి చిత్రంతో మరో హిట్ అందుకుని చిరంజీవి , మహేష్ బాబు సరసన నటించింది కానీ అవేవి పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమె కెరీర్ గాడితప్పింది. అవకాశాలు పెద్దగా రాలేదు.. ఈ క్రమంలో సినిమాల్లో నటిస్తున్న సమయాల్లో దర్శకుడు ప్రేమ్తో ప్రేమలో పడింది. కొంతకాలానికే వారు వివాహాం చేసుకున్నారు. అయితే ఈ మధ్య రక్షిత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఈసారి ఏ పాత్రల్లోనూ నటించడంలేదు. భర్త ప్రేమ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న 'విలన్' సినిమాలో అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారామె. ఈ సినిమా హిట్ అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ను డబ్బింగ్ తోనే కొనసాగించాలని రక్షిత అనుకుంటోంది. సో.. మొత్తానికి రక్షిత ఈ విధంగా సెటిల్ అయ్యిందన్నమాట.