ఏసీబీకి చిక్కిన ఖాకీలు

Update: 2018-10-23 12:11 GMT

హైదరాబాద్ లో లంచం తీసుకుంటూ ఓ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. పాతబస్తీ మీర్‌చౌక్‌ ఎస్సై సారంగపాణి, రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యాడు. 2017 చీటింగ్‌ కేసు రాజీ కోసం ఎస్సై సారంగపాణి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడత కింద రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, ఇవ్వజూపినా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News