బిడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు లొంగిపోయారు. శ్రీనివాస్ హత్యతో సంబంధం ఉన్న రాంబాబు, మల్లేష్, శరత్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. శ్రీనివాస్ హత్య తర్వాత గోపి, చక్రి, దుర్గయ్య, మోహన్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్ పరామర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ హత్య ముమ్మాటికీ ప్రభుత్వానిదే అని ఉత్తమ్ అన్నారు. శ్రీనివాస్ హత్యలో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ప్రమేయం ఉందంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.