యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'పవర్' ఫేమ్ బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 21న విడుదల కానుంది. 158 నిమిషాల పాటు సాగే ఈ సినిమాలో మూడు పాత్రలు ఎలా ఉంటాయో ఎన్టీఆర్ నే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు.
జై పాత్ర ప్రతినాయకుడి తరహాలో ఉంటే.. లవకుమార్ పాత్ర కథానాయకుడి లక్షణాలతో ఉంటుందని, అలాగే కుశ పాత్ర కి కామెడీ స్కోప్ ఉంటుందని తారక్ చెప్పుకొచ్చారు. రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన 'జై లవ కుశ'లో తమన్నా ఓ ప్రత్యేక గీతం చేసింది.