మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాలలో 'ఠాగూర్' ఒకటి. లంచంపై పోరాటం చేసిన ఓ కామన్మ్యాన్ కథగా 'ఠాగూర్' తెరకెక్కింది. తమిళంలో ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సూపర్హిట్ చిత్రం 'రమణ' (విజయ్ కాంత్ కథానాయకుడు)కి రీమేక్ వెర్షన్గా తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమాలోని 'నేను సైతం' పాటకి గానూ ఉత్తమ పాటల రచయితగా సుద్దాల అశోక్ తేజకి జాతీయ పురస్కారం దక్కింది. శ్రియ, జ్యోతిక కథానాయికలుగా నటించిన 'ఠాగూర్' సెప్టెంబర్ 24, 2003న విడుదలైంది. అంటే.. నేటితో ఈ చిత్రం 14 వసంతాలను పూర్తిచేసుకుంటోందన్నమాట.