Gold Rate : భారీగా పెరిగిన బంగారం..మళ్ళీ పెరిగిన వెండి!

Update: 2020-04-04 02:36 GMT

నిన్న కొద్దిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు భారీ  పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు (ఏప్రిల్ 4) బంగారం ధరలు పది గ్రాములకు 720 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కేజీకి 110 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

బంగారం ధరలు నాలుగురోజుల తరువాత పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (04.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 230 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,960 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు ఏకంగా 710 రూపాయల భారీ పెరుగుదలతో 43,980 రూపాయలు నమోదు చేసింది.

మళ్ళీ పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరల తో పాటూ, వెండి ధరలు కూడా మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 110 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,270 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 230 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,960 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 720 రూపాయల పెరుగులతో 43,980 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా పెరిగాయి. వెండి ధర 40,270 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 730 రూపాయల భారీ పెరుగుదలతో 44,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 720 రూపాయల పెరుగుదలతో 41,900 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 40 వేల మార్కు దాటి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,270 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News