నేడు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల
YS Sharmila: మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వెళ్లనున్న షర్మిల
నేడు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల
YS Sharmila: వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెల 18న షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో నిశ్చితార్థం జరగనుండగా.. ఫిబ్రవరి 17న పెళ్లి జరపనున్నట్టు ఇప్పటికే వైఎస్ షర్మిల ప్రకటించారు. కాగా.. తొలి పెళ్లి పత్రికను వైఎస్ ఘాట్ దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోవడానికి షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు.
మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు షర్మిల కుటుంబంతోపాటు.. అట్లూరి ప్రియా కుటుంబం కూడా చేరుకుని.. వైఎస్ ఘాట్కు చేరుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారు. సాయంత్రం ఇడుపులపాయలోనే ఇరు కుటుంబాలు బస చేయనున్నారు.