వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎవరెవరు ఏఏ అంశాలు ప్రస్తావించాలి, ఏఏ బాధ్యతలు నిర్వర్తించాలి, కేంద్రానికి ఎలా రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో చర్చించినట్లు మిథున్రెడ్డి తెలిపారు. అలాగే, పోలవరంపై లోక్సభలో చర్చ జరిగేలా కాలింగ్ అటెన్షన్ మోషన్ మూవ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.