జాతీయపతాకంపై వైసీపీ రంగులు
-అనంతపురం జిల్లాలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు -గ్రామసచివాలయానికి ఉన్న జాతీయ పతాకంపై వైసీపీ రంగులు -పెయింటింగ్ వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు
అనంతపురం జిల్లాలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.గ్రామసచివాలయానికి ఉన్నజాతీయ జెండా రంగును చెరిపేసి.. అధికార పార్టీ జెండా రంగులను తలపించేలా తీర్చిదిద్దిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. వైసీపీకి సంబంధించిన గుర్తులను పెయింటింగ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ రంగులు వేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.