సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. సీఎంగా జగన్‌ ఆ ఒక్క రోజు ఏం సాధిస్తారని...: యనమల

Update: 2019-11-01 08:20 GMT

జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష‌్ణుడు. ఆర్థిక నేరాలలో కోర్టు వాయిదాలకు మినహాయింపు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీఎంగా జగన్‌ ఆ ఒక్క రోజు ఏం సాధిస్తారని మినహాయింపులు అడుగుతున్నారని విమర్శించారు యనమల.

చట్టం ముందు అందరూ సమానం అని రుజువైందన్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. జగన్‌ వ్యక్తిగత కేసుల్లో భాగంగా కోర్టులో హాజరవుతున్నారే తప్ప సీఎంగా ఉన్నప్పటి కేసులు కాదని స్పష్టం చేశారు. జగన్‌ సొంత ఖర్చుతో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతారా..? ప్రజల డబ్బుతో వెళ్తారా అనేది ఆయన ఇష్టమన్నారు బోండా ఉమ.

Tags:    

Similar News