అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష

-మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు తీర్పు -ఇబ్రహింపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కృష్ణారావు

Update: 2019-12-02 15:17 GMT
Court File Photo

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది విజయవాడలోని పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు. గత ఏడాది జనవరి లో ఇబ్రహీంపట్నంలోని బంధువుల ఇంటికి వచ్చిన సైకం కృష్ణారావు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. బాలిక తల్లి ఇబ్రహింపట్నం పోలీసులను ఆశ్రయించింది. విచారమ జరిపిన పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు కృష్ణారావుకు 20 ఏళ్ల కఠినకారాగార శిక్ష విధించింది పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు. 

Tags:    

Similar News