టీడీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్పై వంశీ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టినట్టు సమాచారం.