Vallabhaneni Vamsi: ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..

Vallabhaneni Vamsi: ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..

Update: 2023-01-30 16:00 GMT

Vallabhaneni Vamsi: ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..

Vallabhaneni Vamsi: టీడీపీ గన్నవరం ఇంచార్జి బచ్చుల అర్జునుడు, పట్టాభిపై గన్నవరం కోర్టులో పరువునష్టం దావా వేశానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తాను..సీఎం జగన్ చేపట్టిన పలు పథకాలు ఆకర్షించి వైసీపీకి మద్దతు తెలిపానన్నారు. అప్పటి నుంచి టీడీపీ తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందన్నారు. విజయవాడలో సంకల్ప సిద్ధి కేసులో తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు వంశీ. తనపై టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని..అలాంటి వారిపై తాను న్యాయపోరాటం చేస్తున్నానని తెలిపారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వారిపై శిక్ష పడాలని కోర్టులో కేసు వేశానని వల్లభనేని వంశీ తెలిపారు.

Tags:    

Similar News