శ్రీశైలం నుంచి కర్నూలుకు వెళుతున్న మంత్రి అనిల్ కుమార్ కాన్వాయ్ను శ్రీశైలం నీటి మునక నిరుద్యోగులు అడ్డుకున్నారు. శ్రీశైలం నీటి మునక నిర్వాసితులు ఒక్కసారిగా మంత్రి కాన్వాయ్ ముందుకు రావడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. గత 60 రోజులుగా తాము రిలే దీక్షలు చేస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని నిరుద్యోగ నిర్వాసితులు వాపోయారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.